టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డిపై విచారణకు మంగళగిరి పోలీసులు నోటీసులు పంపడం రాజకీయ వేడి పెంచింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో లుకౌట్ నోటీసులతో అడ్డుకోవడం, ఆపై సజ్జలకు నోటీసులు రావడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
సజ్జల మాట్లాడుతూ, తాను దేశం వదిలి పారిపోలేదని, తప్పుడు కేసుల పేరుతో హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. “పారిపోతే తప్పు చేసిన వారే పారిపోతారు. మీరే పెట్టిన తప్పుడు కేసు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు” అని సజ్జల అన్నారు.
టీడీపీ కార్యాలయంపై 2021లో జరిగిన దాడి కేసు అప్పటికే ముగిసిందని, మళ్లీ ఆ కేసు పేరు చెప్పి నోటీసులు పంపడం అన్యాయం అని ఆరోపించారు.
అంతేకాక, సుప్రీంకోర్టు తనకు ఇంటెరిమ్ ప్రొటెక్షన్ ఇచ్చినా, ఇప్పటికీ నోటీసులు రావడం రాజకీయం కోసమేనని విమర్శించారు. చంద్రబాబు మీద వివాదాలు ఉన్నందున కేసులు పెట్టారని, న్యాయస్థానాలు తేల్చుకుంటాయని పేర్కొన్నారు.