fbpx
Sunday, September 8, 2024
HomeBusinessకరోనాతో సంక్షోభంలోకి చిన్న,పెద్ద కంపెనీలు

కరోనాతో సంక్షోభంలోకి చిన్న,పెద్ద కంపెనీలు

10000-COMPANIES-CLOSED-IN-INDIA-AMID-COVID

న్యూఢిల్లీ: గత ఏడాది వచ్చిన కరోనా సంక్షోభంతో దేశంలో చాలా వరకు కంపెనీలు కుదేలయినాయి. ఆదాయాలు లేక చిన్న పెద్ద కంపెనీలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి జారుకున్నాయి. దీనికి సంబంధించిన ప్రభుత్వం షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. కరోనా వైరస్ వల్ల దేశంలో ఏకంగా 10వేలకుపైగా కంపెనీలు మూతపడ్డాయని తెలిపింది.

2020-21లో వ్యాపారాలను నిలిపివేసిన నమోదిత కంపెనీల వివరాలను తెలియజేయాల్సిందిగా లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఈ వివరాలు తెలియజేశారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు జరగకపోవడమే ఇందుకు కారణమని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

దేశ కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గతేడాది ఏప్రిల్‌ నుంచి 2021 ఫిబ్రవరి వరకు దేశంలో 10113 కంపెనీలు స్వచ్ఛందంగా మూసి వేయబడ్డాయని ప్రభుత్వం వెల్లడించింది. 2014 కంపెనీల చట్టంలోని సెక్షన్‌ 248(2) కింద ఈ కంపెనీలను మూసివేశారు.

అత్యధికంగా ఢిల్లీలో 2,395 కంపెనీలు మూతపడగా.. ఉత్తరప్రదేశ్‌ 1,936 కంపెనీలతో ఆ తర్వాతి స్థానంలో ఉంది. అలాగే తమిళనాడులో 1,322, మహారాష్ట్రలో 1,279, కర్ణాటకలో 836, చండీగఢ్‌లో 501, రాజస్థాన్‌లో 479, తెలంగాణలో 404, కేరళలో 307, ఝార్ఖండ్‌లో 137, మధ్యప్రదేశ్‌లో 111, బిహార్‌లో 104 కంపెనీలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ కాలంలో గుజరాత్ కేవలం 17 కంపెనీలు మాత్రమే మూతపడగా, హరియాణాలో ఒక్కటి కూడా మూతపడలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular