fbpx
Sunday, September 8, 2024
HomeNational150 మంది సాధువులకు సోకిన కరోనా వైరస్!

150 మంది సాధువులకు సోకిన కరోనా వైరస్!

150-MONKS-TESTED-POSITIVE-IN-GYUTO-MONASTERY

ధర్మశాల: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజు పెరుగుతూ మళ్ళీ గుబులు రేపుతున్నాయి. తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌ కంగ్రా జిల్లా జోన్‌గ్యూటో లో ఉన్న ఒక బౌద్ధ ఆశ్రమంలో 150 మంది సాధువులకు కరోనా వైరస్ సోకిందని తెలిసింది. గత నెల ఫిబ్రవరి 18వ తేదీన టిబెటన్ నూతన సంవత్సరం సందర్భంగా బౌద్ధ ఆశ్రమంలో వేడుకలు జరిగాయి.

ఈ నేపథ్యంలో బౌద్ధ ఆశ్రమంలో ఇటీవల 20 మందికి వైరస్ సోకిందని నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన వైద్యాధికారులు 330 మంది సాధువులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 154 మందికి కరోనా పాజిటివ్ అని ఫలితం వచ్చింది. 8 రోజుల్లోనే 154 మందికి కరోనా సోకడంతో గ్యూటో ఆశ్రమాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ ఆశ్రమానికి కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల నుంచి ఫిబ్రవరి 23వ తేదీన 15 మంది బౌద్ధ భిక్షువులు వచ్చారు.

కాగా కరోనా వచ్చిన సాధువుల్లో వ్యాధికి సంబ్బంధించిన ఎలాంటి లక్షణాలు బయటపడలేదని, ప్రయాణాలు చేసి వచ్చిన వారిని ఆశ్రమంలోనే క్వారంటైన్ చేశామని కంగ్రా జిల్లా కలెక్టరు రాకేష్ ప్రజాపతి తెలిపారు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే బయట ప్రాంతాల నుంచి వచ్చిన సాధువులకు కరోనా నెగిటివ్ అని తేలింది.

అయితే ఇందులో ఒకరి ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమించడంతో ఆయనని తాండ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించామని కలెక్టర్‌ వివరించారు. ధర్మశాలలోని కరోనా ప్రబలిన బౌధ్ధ ఆశ్రమానికి సీలు వేశామని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ చెప్పారు. బౌద్ధ ఆశ్రమంలో 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాలు వేశామని కూడా అధికారులు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular