హైదరాబాద్: హైదరాబాద్ లోని అఫ్జల్గంజ్లో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పుతున్నారు. కాగా భారీగా నిలువ ఉన్న టైర్ల గోదాంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది.
గోదాము పక్కన ఉన్న గుడిసె వాసులు కాపర్ వైరును కాల్చుతుండగా ఈ మంటలు చెలరేగాయి. అఫ్జల్గంజ్ పోలీస్ సిబ్బంది, స్థానికులు అక్కడ ఉన్న టైర్లను మరో చోటుకి హుటాహుటిన తరలించారు. ఇప్పటికే ఘటనా స్థలానికి ఎనిమిది ఫైర్ఇంజన్లు చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి.
ఈ ప్రమాదంతో అఫ్జల్గంజ్ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలతో నిండిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. గోదాం పక్కనే భారత్ పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఇప్పటికైతే పెట్రోల్ బంక్కు ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. కానీ, మంటలో అదుపులోకి రాకపోతే పెట్రోల్ బంక్కు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.