fbpx
Monday, October 28, 2024
HomeBusinessలాక్‌డౌన్ వల్ల రెక్కలు తొడిగిన బంగారం ధరలు

లాక్‌డౌన్ వల్ల రెక్కలు తొడిగిన బంగారం ధరలు

GOLD-PRICES-SEES-HIKE-AMID-LOCKDOWN

ముంబై: కరోనా వేళ దేశంలోని స్టాక్ మార్కెట్లు, బులియన్ మార్కెట్లు గత వారం లాభాలతో దూసుకెళ్లాయి. విదేశీ పెట్టుబడుల ద్వారా కొంతమేరకు మార్కెట్లకు జోష్ వచ్చింది. ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్లు విధించిన కారణంగా కరోనా త్వరలోనే తగ్గుతుందనే అభిప్రాయం అందరికీ ఉంది.

అయితే వచ్చే 2 నెలల పాటు కరోనా కేసులు ఇలాగే ఉండి ఆ తరువాత తగ్గవచ్చని పెట్టుబడిదారుల అభిప్రాయం. దీనివల్ల ఈ స్వల్ప కాలంలో బంగారంపై పెట్టుబడి పెడితే బాగా కలిసొస్తుందని అంచనా కడుతున్నారు. దీనితో పాటు పెళ్లిళ్ల సీజన్ అవడంతో నగల కొనుగోళ్లు కూడా కాస్త పెరిగాయి. అందుకే బంగారం ధరలు కూడా దూసుకెళ్తున్నాయి.

ఈ నెల మే 5 వరకు బాగా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ రోజు ఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్చమైన 10 క్యారెట్ల బంగారం ధర ఒకే సారి రూ.280 వరకు పెరిగింది. మే 7న దీని ధర రూ.47,575గా ఉంది. అలాగే, ఆర్నమెంట్ బంగారం 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,579 నుంచి రూ.43,834కు పెరిగింది.

ఈ రోజు హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,610లో ఎటువంటి మార్పు లేదు. పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల 10 గ్రాములు ప్యూర్ గోల్డ్ ధర మాత్రం రూ.510 తగ్గి రూ.48,670కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. బంగారం ధరతో పాటు వెండి ధరలు పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.71,073 నుంచి రూ.71,967కు చేరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular