న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా బాగా తగ్గిన బంగారం ధర, గత రెండురోజుల నుంచి మళ్ళీ పెరుగుతూ పోతోంది. ఈ పసిడి ధర విషయంలో మార్కెట్ నిపుణులు సైతం ధరలు ఎప్పుడు పెరగుతాయో ఎప్పుడు తగ్గుతాయో అనే పక్కా అంచనా వేయలేకపోతున్నారు.
భారత రాజధాని అయిన న్యూఢిల్లీలో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు ఏకంగా రూ.300 పెరగడంతో ధర రూ.48,480 ని తాకింది. అంతర్జాతీయంగా బంగారం కి డిమాండ్ పెరగడంతోనే మళ్ళీ బంగారం ధర పెరిగినట్లు బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరో వైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. నేడు రూ.1433 పెరగడంతో ఒక కిలో వెండి రూ.73,168కు చేరుకుంది.
దక్షిణాన హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 పెరిగి రూ.45,450 వద్ద నిలిచింది. దానితో పాటు, పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల 10 గ్రాములు ప్యూర్ గోల్డ్ ధర మాత్రం రూ.330 పెరిగి రూ.49,590కు చేరుకుంది. కాగా హైదరాబాద్ మరియు విజయవాడలో ఇవాళ బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి.
కాగా పసిడి ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,869 డాలర్లు కాగా, వెండి ఔన్సు 28.48డాలర్లుగా నమోదైంది.