అగర్తల: బీజేపీ అధిష్టానం త్రిపుర రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రి గా డాక్టర్ మాణిక్ సాహా(69)పేరును శనివారం ఖరారు చేసింది. దీంతో ఇక ఆయన త్రిపురకు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు.
కాగా, డాక్టర్ మాణిక్ సాహా ప్రస్తుతం త్రిపుర రాష్ట్ర బీజేపీ చీఫ్ గా బాధ్యతలను నిర్వహించడంతో పాటుగా త్రిపుర క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా కూడా సేవలందిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఆయన 2016 సంవత్సరంలో బీజేపీ పార్టీలో చేరారు. అయితే, రాజకీయాల్లోకి రాకముందు ఆయన త్రిపుర మెడికల్ కాలేజీలో డెంటల్ ఫ్యాకల్టీగా పనిచేశారు. అంతకు ముందు సీఎంగా ఉన్న బిప్లవ్ దేవ్ అధిష్టానం ఆదేశాల మేరకు తన పదవికి రాజీనామా చేశారు.