తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవాణి టికెట్లు సంబంధించి టీటీడీ అప్డేట్ ఇచ్చింది.
జూలై 22వ తేదీ నుండి శ్రీవాణి ఆఫ్లైన్ టిక్కెట్ల కోటా కేవలం 1000 మందికి మాత్రమే పరిమితం చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి రోజురోజుకు పెరుగుతోన్న భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యతను ఇవ్వడం కోసం టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
అందు కోసం, జులై 22వ తేదీ నుండి శ్రీవాణి దర్శన టిక్కెట్ల రోజువారి కోటాను వెయ్యికి పరిమితం చేసింది.
కాగా ఈ టికెట్లు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 మొదటగా వచ్చిన వారికి ఇస్తారు, ఇక మిగిలిన 100 టిక్కెట్లను శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలోనే కరెంట్ బుకింగ్ కౌంటర్లలో అందుబాటులో ఉంచారు.
దాతలకు శ్రీవాణి టికెట్లు బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి విమానాశ్రయ కౌంటర్లో ఈ ఆఫ్లైన్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ వెల్లడించింది.