fbpx
Friday, September 20, 2024
HomeBig Storyఒలంపిక్ల్స్ 2024 లో పి.వి.సింధు తొలి విజయం!

ఒలంపిక్ల్స్ 2024 లో పి.వి.సింధు తొలి విజయం!

PVSINDHU-WINS-FIRST-MATCH-AT-OLYMPICS-2024
PVSINDHU-WINS-FIRST-MATCH-AT-OLYMPICS-2024

పారిస్: రెండు సార్లు ఒలింపిక్స్ పతక విజేత అయిన భారత షట్లర్ పి.వి.సింధు తన పారిస్ ఒలింపిక్స్ ప్రస్థానాన్ని మాల్దీవుల క్రీడాకారిణి ఫతీమత్ అబ్దుల్ రజాక్ పై సునాయాస విజయంతో ప్రారంభించింది.

మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో సింధు 21-9, 21-6 తేడాతో కేవలం 29 నిమిషాల్లో ప్రత్యర్థిని ఓడించింది.

ప్రపంచ నంబర్ 111 ఫతీమత్ మాజీ ప్రపంచ చాంపియన్ సింధుకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. సింధు కేవలం 13 నిమిషాల్లోనే తొలి గేమ్‌ను ముగించింది.

రెండో గేమ్ కూడా ఇలాగే సాగింది. సింధు మొదటి నాలుగు పాయింట్లను క్షణాల్లో సాధించి, ప్రారంభంలోనే ఆధిక్యం సంపాదించింది.

అయితే, సింధు చేసిన ఒక తప్పిదాన్ని ఉపయోగించి రజాక్ పాయింట్లను 3-4కి దగ్గర చేసింది. కానీ, భారతీయ షట్లర్ మళ్లీ ఆధిపత్యం చాటుకుంటూ 10-3కి పాయింట్ల తేడాను పెంచింది.

చివరికి, సింధు వద్ద 14 మ్యాచ్ పాయింట్లు ఉండగా, ఆమె కేవలం ఒక పాయింట్‌తోనే మ్యాచ్‌ను ముగించింది.

రియో గేమ్స్ 2016లో రజత పతకం, గత టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలుచుకున్న 10వ సీడ్ భారత షట్లర్ సింధు, బుధవారం తన రెండవ గ్రూప్ మ్యాచ్‌లో ఎస్టోనియాకు చెందిన ప్రపంచ నంబర్ 75 క్రిస్టిన్ కూబాతో తలపడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular