fbpx
Thursday, September 19, 2024
HomeAndhra Pradeshవిద్యారంగంలో సమూల మార్పులు తెస్తాం: మంత్రి నారా లోకేశ్‌

విద్యారంగంలో సమూల మార్పులు తెస్తాం: మంత్రి నారా లోకేశ్‌

AP -Minister- Nara -Lokesh- pointed- out-YS-Jagan

ఆంధ్రప్రదేశ్: విద్యారంగంలో సమూల మార్పులు తెస్తాం: మంత్రి నారా లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా విమర్శిస్తూ, వచ్చే విద్యాసంవత్సరం నుండి పరీక్షా విధానంలో మార్పులు తీసుకొస్తామని ప్రకటించారు.

గతంలో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలు 1000 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేశాయని, సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి విద్యార్థులను సరైన విధంగా సిద్ధం చేయకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు.

పరీక్షా విధానంలో మార్పులు:
వచ్చే విద్యాసంవత్సరం నుండి 6వ తరగతి నుంచి సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి విద్యార్థులను సిద్ధం చేయడం, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం వంటి కీలక నిర్ణయాలను తీసుకుంటామని లోకేశ్ వెల్లడించారు.

జగన్‌పై ఎద్దేవా:
జగన్ ఎక్కడ చదివాడో, ఏం చదివాడో తెలియని వ్యక్తి విద్యాశాఖపై మాట్లాడటం తగదని లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల 75,000 మంది పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని అన్నారు. ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి వచ్చే విద్యా సంవత్సరం 6వ తరగతి నుంచే పరీక్షా విధానంలో మార్పులు తీసుకొచ్చి సీబీఎస్ఈలో పరీక్షలు రాసేందుకు విద్యార్థులను సిద్ధం చేస్తామని లోకేశ్ తెలిపారు. గుడ్లు, బర్ఫీలు, ఆఖరికి ఆయమ్మల జీతాలు కూడా బకాయి పెట్టి పోయిన కంసమామ.. పాఠశాలల రూపురేఖలు మార్చాను అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. జగన్ అంత ఉద్దరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసం:
చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంత నిధులు ఖర్చు పెట్టడానికి అయినా సిద్ధంగా ఉందని లోకేశ్ తెలిపారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు నిపుణులతో చర్చించి సవరణలు తీసుకువస్తామని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular