ముంబై: ఇవాళ్టి స్టాక్ మార్కెట్ వివరాలు ఇలా: సెన్సెక్స్ నిఫ్టీ కొత్త రికార్డులు సాధించాయి. సెన్సెక్స్, నిఫ్టీ, నిఫ్టీ బ్యాంక్ అన్నీ అతి పెద్ద స్థాయిలో ముగిశాయి.
ఈ రోజు ట్రేడింగ్ ముగింపులో, సెన్సెక్స్ 1,359 పాయింట్లు (1.63 శాతం) పెరిగి 84,544 వద్ద, నిఫ్టీ 375 పాయింట్లు (1.48 శాతం) పెరిగి 25,790 వద్ద ముగిసింది.
నిఫ్టీ బ్యాంక్ 755 పాయింట్లు (1.42 శాతం) పెరిగి 53,793 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో, మూడు ప్రధాన సూచికలన్నీ కొత్త ఆల్-టైమ్ హైలను నమోదు చేశాయి.
సెన్సెక్స్ 84,694, నిఫ్టీ 25,849, నిఫ్టీ బ్యాంక్ 54,066 వద్ద ఇంట్రాడే హైలు నమోదు చేశాయి.
కాగా, మిడ్క్యాప్ మరియు స్మాల్క్యాప్ స్టాక్స్లో కూడా ఇవాళ కొనుగోళ్లు బాగా చోటుచేసుకున్నాయి.
నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ 60,208 వద్ద 856 పాయింట్లు (1.44 శాతం) పెరిగి ముగిసింది. నిఫ్టీ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 19,332 వద్ద 187 పాయింట్లు (0.98 శాతం) పెరిగింది.
సెన్సెక్స్లోని 30 స్టాక్స్లో 26 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. దాదాఫు అన్ని రంగాల సూచికలు ఇవాళ లాభాలతో ముగిశాయి.
ఆటో, ఐటి, ఫిన్ సర్వీస్, ఫార్మా, మెటల్, రియాల్టీ, ఎఫెంసీజీ మరియు ఎనర్జీ ప్రధాన లాభదారులుగా నిలిచాయి.