fbpx
Friday, October 18, 2024
HomeAndhra Pradeshకర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం: చంద్రబాబు

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం: చంద్రబాబు

AP-CM-TO-FORM-HIGH-COURT-BENCH-IN-KURNOOL
AP-CM-TO-FORM-HIGH-COURT-BENCH-IN-KURNOOL

అమరావతి: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

అంతేకాకుండా, అమరావతిలో 100 ఎకరాల్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

సచివాలయంలో నిన్న జరిగిన న్యాయశాఖ సమీక్షలో చంద్రబాబు ఈ విషయాలను వివరించారు.

జూనియర్ న్యాయవాదులు ఆర్థికంగా బలపడేందుకు వారికి నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం అందించాలనీ, అలాగే శిక్షణ ఇచ్చే అకాడమీని స్థాపించాలన్న ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

నేర పరిశోధనలను వేగవంతం చేసి, శిక్షల శాతాన్ని పెంచేందుకు ఆధునిక పద్ధతులను అనుసరించాలని ఆయన అధికారులకు సూచించారు.

నేరం చేసిన వారికి శిక్ష తప్పదని ప్రజల్లో నమ్మకం కల్పించాలని పేర్కొన్నారు. అదనంగా, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం మాత్రమే కోర్టులను ఆశ్రయించాలనీ, అనవసరమైన వివాదాలకు పాల్పడవద్దని చంద్రబాబు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular