fbpx
Friday, October 18, 2024
HomeNational‘ఆయుష్మాన్‌ భారత్‌’ పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం కీలక ఆదేశం!

‘ఆయుష్మాన్‌ భారత్‌’ పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం కీలక ఆదేశం!

Center-key-directive-to-states-and-Union-Territories-on-Ayushman-Bharat

న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా’ పథకంలో అర్హులైన వృద్ధులను చేర్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఈ పథకం కింద ఆరోగ్య బీమా (ఏడాదికి రూ. 5 లక్షలు) అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

కేంద్రం కీలక ఆదేశాలు
సెప్టెంబర్ 29న, కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఎల్‌.ఎస్‌.చాంగ్‌సాంగ్‌ ఈ మేరకు లేఖ రాశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వృద్ధుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆయుష్మాన్ భారత్ పథకంలో అర్హులైన వృద్ధులను చేర్పించాలని ఆదేశించారు. వృద్ధుల నమోదు కోసం ఆయుష్మాన్ మొబైల్ యాప్‌ మరియు వెబ్ పోర్టల్‌ను ఉపయోగించాలని సూచించారు.

నమోదు ప్రక్రియ
ఈ పథకంలో చేరాలనుకునే 70 ఏళ్లు పైబడిన వృద్ధులు, వారి ఆధార్ కార్డులో ఉన్న వయసు ఆధారంగా ఆయుష్మాన్ యాప్‌ లేదా పోర్టల్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎప్పటికప్పుడు కొనసాగుతుందని, ఆర్థిక లేదా సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా అర్హులైన వృద్ధులు ఈ పథకంలో చేరవచ్చని తెలిపారు.

ఈ పథకం కింద వృద్ధులకు అన్ని వైద్య సదుపాయాలు వార్షికంగా రూ. 5 లక్షల వరకు కవరేజీతో అందించబడతాయని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular