ముంబై: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రోహిత్ కుమార్ సింగ్ తన పాత టీసీఎస్ ఆఫర్ లెటర్ ను ఎక్స్ వేదికగా షేర్ చేయగా, అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
1989 బ్యాచ్ రాజస్థాన్ కేడర్కు చెందిన రోహిత్ కుమార్ సింగ్, 1984లో టీసీఎస్లో ఉద్యోగం పొందారు. ఈ సంధర్భంగా, ఆ కాలం ఆఫర్ లెటర్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
1984 జూన్ 20న జారీ చేయబడిన ఆ లెటర్ ప్రకారం, జూన్ 4 నుంచి నెలకు రూ.1,300 వేతనం అందించేలా అందులో పేర్కొన్నారు.
40 సంవత్సరాల క్రితం ఆయన వేతనం, ఇతర వివరాలు ఆ లెటర్లో స్పష్టంగా ఉన్నాయి.
రోహిత్ కుమార్ సింగ్ తన పోస్టులో, తాను బెనారస్ హిందూ యూనివర్సిటీ (భూ) క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎంపికవ్వగా, మొదటి ఉద్యోగం ముంబైలోని టీసీఎస్లో వచ్చిందని తెలిపారు.
అప్పట్లో రూ. 1,300 వేతనం చాలా పెద్ద మొత్తం అనిపించేదని, నారీమన్ పాయింట్లోని ఎయిర్ ఇండియా భవనంలోని 11వ అంతస్తు నుంచి సముద్ర వీక్షణ అమోఘంగా ఉండేదని గుర్తుచేసుకున్నారు.
1984లో టీసీఎస్లో చేరిన రోహిత్ కుమార్ సింగ్, మాస్టర్ డిగ్రీ కోసం న్యూయార్క్లోని క్లార్క్సన్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్లో ప్రవేశం పొందారు.
మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఆయన భారత్ తిరిగి వచ్చి, సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాశారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్గా ఎంపికయ్యారు.