న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణకి వరద సాయం ప్రకటించింది. వీటితో పాటుగా ఇతర రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది.
మొత్తం 14 రాష్ట్రాలకు రూ. 5,858.60 కోట్లు మంజూరు చేయగా, ఇందులో తెలంగాణకు రూ. 416.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ. 1,036 కోట్లు కేటాయించింది.
కాగా, అందరికంటే అత్యధికంగా మహారాష్ట్రకు రూ. 1,432 కోట్లు మంజూరు చేయబడింది.
ఇక గుజరాత్కు రూ. 600 కోట్లు, కేరళకు రూ. 145.60 కోట్లు కేటాయించింది. ఈ నిధులు రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధిలో కేంద్రం వాటా కింద ఎన్డీఆర్ఎఫ్ ద్వారా విడుదల చేయబడ్డాయి.
అయితే ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపీ, తెలంగాణ, కేరళ సహా మరికొన్ని రాష్ట్రాలలో కేంద్ర బృందాలు పర్యటించి, నష్టాన్ని అంచనా వేసిన నివేదికలను సమర్పించాయి.
ఈ నివేదికల ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వ హోంశాఖ తక్షణ సాయంగా ఈ నిధులను ఆమోదించి విడుదల చేసింది.