అమరావతి: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై జైలులో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్కు ఏపీ హైకోర్టు భారీ ఊరట కలిగించింది. నందిగం సురేశ్తో పాటు విజయవాడ మాజీ మేయర్ భర్తకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
గత నెలలో టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేశ్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నించినప్పటికీ నిరాశ ఎదురైంది. పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళినప్పటికీ కనిపించకపోవడంతో చివరికి హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
పోలీసులు ఆయనను కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు అనుమతితో రెండు రోజుల కస్టడీలోకి తీసుకొని విచారించారు. రిమాండ్ ముగియడంతో ఈ నెల 17 వరకు జ్యుడిషియల్ రిమాండ్ను నిన్ననే పొడిగించారు. అయితే, నందిగం సురేశ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.