ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, భారతీయ జనతా పార్టీకి హర్యానా, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో భారీ ఎదురు దెబ్బ తగలబోతుందని తెలుస్తోంది. హర్యానాలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ, తాజా ఎన్నికల్లో అధికారం కోల్పోయే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి.
మూడింట రెండు వంతుల సీట్లతో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాబోతుందని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. హర్యానాలో 46 సీట్లు సాధిస్తే మెజారిటీగా నిలిచే అవకాశం ఉన్నా, కాంగ్రెస్ 60కి పైగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కశ్మీర్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు దక్కుతాయని, బీజేపీ తరువాత స్థానంలో నిలిచే అవకాశముంది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్ 33-35 సీట్లు, బీజేపీ 23-27 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేసింది.
ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి ఈ రెండు రాష్ట్రాల్లో ఎదురుదెబ్బగా మారనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు ఫలితాలు ఈ నెల 8న విడుదల కానున్నాయి.