fbpx
Friday, October 18, 2024
HomeAndhra Pradeshశ్రీకాకుళం లో మరో రాజకీయ హత్య!

శ్రీకాకుళం లో మరో రాజకీయ హత్య!

Another political murder in Srikakulam

శ్రీకాకుళం: జిల్లాలోని పోలాకి మండలం వన విష్ణుపురంలో పండుగ పూట ఘోరం చోటు చేసుకుంది. టీడీపీ మరియు వైసీపీ వర్గాల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానై తీవ్ర ఘర్షణకు దారితీసింది. పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్న ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ గొడవలో టీడీపీ కార్యకర్త వీరాస్వామి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. ఈ హత్యతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

స్థానికుల సమాచారం ప్రకారం, ఈ దాడులు వ్యక్తిగత వైరం కారణంగా రాజుకున్నాయి. వర్గీయ నేతలు రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో పండుగ సంబరాలు మధ్య గ్రామంలో విషాదం అలముకుంది. ఈ ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి, గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలను కాపాడేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular