fbpx
Friday, October 18, 2024
HomeAndhra Pradeshటీడీపీ: చంద్రబాబు విజన్ పై లోకేష్ కీలక వ్యాఖ్యలు

టీడీపీ: చంద్రబాబు విజన్ పై లోకేష్ కీలక వ్యాఖ్యలు

lokesh-comments-on-chandrababu-vision-redbook-warnings

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన యువగళం పాదయాత్ర సమయంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇబ్బందుల పట్ల మండిపడ్డారు. ఇటీవల మంగళగిరిలో జరిగిన కియా షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా, లోకేష్ మీడియాతో మాట్లాడారు. 

ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. లోకేష్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో కొన్ని అధికారులు, నేతలు చట్టాన్ని ఉల్లంఘించి భూకబ్జాలకు పాల్పడ్డారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

తాను రెడ్‌బుక్‌లో వారి పేర్లను రాసుకున్నానని, అందుకు భయపడే వారు కూడా ఉన్నారని తెలిపారు. జగన్ పర్యటనలపై స్పందిస్తూ, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కానీ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.

రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలో చంద్రబాబు నాయుడి విజన్ కీలకమని, ఆయన హయాంలో టీసీఎస్, లులూ, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీపై దృష్టి సారించాయని చెప్పారు. 

ప్రస్తుతం పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నవారిని వదిలిపెట్టబోమని లోకేష్ స్పష్టం చేశారు. కియా కార్లపై “మేడిన్ ఆంధ్రప్రదేశ్” ఉండడమే చంద్రబాబు విజన్‌కు నిదర్శనమని, అందుకే ప్రతి ఆంధ్రుడు గర్వపడాలని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular