fbpx
Wednesday, October 23, 2024
HomeAndhra Pradeshవైసీపీకి గుడ్ బై చెప్పిన వాసిరెడ్డి పద్మ, సంచలన వ్యాఖ్యలు

వైసీపీకి గుడ్ బై చెప్పిన వాసిరెడ్డి పద్మ, సంచలన వ్యాఖ్యలు

vasireddy-padma-resigns-from-ysrcp-slams-jagan

వాసిరెడ్డి పద్మ: 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం తర్వాత ఆ పార్టీ నేతల నుంచి రాజీనామాలు పెరుగుతున్నాయి. పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేయడంతో, జగన్‌కు ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కూడా షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేసిన పద్మ, జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పార్టీని నడపడంలో, సమాజంపై బాధ్యత లేకుండా జగన్ వ్యవహరిస్తున్నారని పద్మ మండిపడ్డారు. జగన్ మాటలన్నీ కేవలం గుడ్ బుక్, ప్రమోషన్ పేరుతోనే ఉంటాయని, కానీ నాయకులు, కార్యకర్తల కోసం గుండె బుక్ ఉండాలని ఎద్దేవా చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల కృషిని గుర్తించకపోవడం బాధించిందని అన్నారు.

గతంలో జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో వాసిరెడ్డి పద్మ అసంతృప్తి చెందారు. అప్పటినుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో, పార్టీ మీద తన అభిప్రాయాన్ని ప్రజలకు వెల్లడించాలనే నిర్ణయానికి వచ్చారని చెప్పారు. వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular