మూవీడెస్క్: యువ హీరో సాయి దుర్గ తేజ్ తన 18వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రానున్నారు.
ఈ సినిమా రోహిత్ కేపీ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో రూపొందుతుండటం విశేషం.
సుమారు 125-150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది.
ఇటీవల ఏబీపీ సౌత్ సమ్మిట్లో పాల్గొన్న సాయి దుర్గ తేజ్, తన బాబాయ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి సంతోషంగా మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ను తన గైడింగ్ ఫోర్స్గా అభివర్ణిస్తూ, ఆయన నాకు ప్రేరణ. నాకు అన్ని విషయాల్లోనూ గైడ్ చేశారు.
నా యాక్టింగ్ ప్రతిభను పెంచుకోవడానికి ఆయన చేసిన సహాయం అమోఘం.
ఈ ఫీల్డ్లోకి అడుగు పెట్టేందుకు కారణం ఆయనే, అంటూ సాయి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
తాజాగా పవన్ గురించి సాయి దుర్గ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ పట్ల తనకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని, గౌరవాన్ని పంచుకోవడం అభిమానులను ఆకట్టుకుంది.
ప్రస్తుతం తన SDT18 సినిమాతో బిజీగా ఉన్న సాయి దుర్గ తేజ్, తన కెరీర్లో మరో పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నారు.