మూవీడెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై రీమేక్ ప్రచారం జరుగుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ స్టార్ ఇళయ దళపతి విజయ్ నటించిన ‘తెరి’ చిత్రానికి రీమేక్ అని కొందరు భావిస్తున్నారు.
అయితే, తాజాగా రచయిత దశరథ్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.
దశరథ్ వివరించిన ప్రకారం, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కథ పూర్తిగా హరీష్ శంకర్ సృష్టించినది, ఇది ‘తెరి’ చిత్రానికి రీమేక్ కాదని తెలిపారు.
కథలో కొన్ని ప్రధాన అంశాలు మాత్రమే సారూప్యంగా ఉంటాయని, కానీ పవన్ కళ్యాణ్ స్టైల్ లో నూతనతతో ఈ సినిమా ఉండబోతుందని చెప్పారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అభిమానులకు కావలసిన పవర్ ఫుల్ సీక్వెన్సులు ఉండబోతున్నాయి.
హైదరాబాద్ ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ కథలో అశుతోష్ రాణా విలన్ గా, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు.
2025 చివర్లో సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
‘ఓజీ’ మరియు ‘హరిహర వీరమల్లు’ చిత్రాలు పూర్తయిన తర్వాత ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.