fbpx
Sunday, October 27, 2024
HomeAndhra Pradeshషర్మిల వివాదంపై మౌనం వీడిన విజయసాయిరెడ్డి

షర్మిల వివాదంపై మౌనం వీడిన విజయసాయిరెడ్డి

ysrcp-leader-saik-reddy-clashes-with-media-at-press-meet

హైదరాబాద్‌: సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబ ఆస్తులు, పంచకాలు వంటి పాత విషయాలను 62 నిమిషాల పాటు చర్చించారు.

తన ప్రసంగంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పంచిన ఆస్తులపై వివరణ ఇచ్చారు. అనంతరం మీడియా ప్ర‌తినిధులకు ప్రశ్నలు అడగమని ఆహ్వానం ఇచ్చారు.

మీడియా ప్ర‌తినిధులు సాయిరెడ్డి-షర్మిల మధ్య మధ్యవర్తిత్వం అంశం గురించి ప్రశ్నించగా, సాయిరెడ్డి కొంత నిర్లక్ష్యంగా స్పందించారు. “మీరు కూడా లిమిట్ క్రాస్ చేశారు” అంటూ ప్రశ్నించిన ప్రతినిధిని సుతిమెత్తగా విమర్శించారు. సాయిరెడ్డి తాను చేయాల్సిందంతా చేసానని, కానీ వివాదం ఎందుకు ఇలా జ‌రిగింద‌న్న ప్ర‌శ్నకు మాత్రం నిర్లిప్తంగా స్పందించారు.

తద్వారా మీడియా ప్రశ్నలపై చురకలంటిస్తూ, షర్మిలను మీడియా ఎందుకు ప్రశ్నించడంలేదు అని ఎదురుప్రశ్నించారు. మిగిలిన మీడియా ప్రతినిధులు సాయిరెడ్డి స్పందనతో మౌనంగా ఉండిపోవడం గమనార్హం. షర్మిలను ప్రశ్నించడం కన్నా తన మీద ప్రశ్నలు ఎందుకు చేస్తున్నారన్నదే సాయిరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular