మూవీడెస్క్: రాజమౌళి ఆధ్వర్యంలో తెలుగు సినిమా పరిశ్రమలో మరో మెజారిటీ అడుగు ముందుకేసింది.
అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పుడు భారతదేశంలోనే మొదటిసారి డాల్బీ సర్టిఫికేషన్ కలిగిన పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాన్ని ప్రారంభించింది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై ఈ టెక్నాలజీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాజమౌళి తన గత అనుభవాన్ని పంచుకున్నారు, ‘‘’ఆర్ఆర్ఆర్’ సినిమా డాల్బీ విజన్ పనులను ఇక్కడే చేయాలని నాకు చాలా ఆశగా ఉండేది.
కానీ అప్పటి వరకు దేశంలో ఆ సదుపాయం లేకపోవడం నిరాశను కలిగించింది’’ అని ఆయన తెలిపారు.
ఇప్పుడు దేశంలో ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావడం పట్ల ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
అలాగే, నటుడు నాగార్జున ఈ టెక్నాలజీని ప్రారంభించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
‘‘ఇది భారతీయ సినిమాలకు ఒక కొత్త మార్గాన్ని చూపించనుంది’’ అని ఆయన చెప్పారు.
సుప్రియా యార్లగడ్డ కూడా ఈ టెక్నాలజీ వల్ల సినిమా మేకింగ్ గొప్పగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించిన ప్రత్యేక ఫుటేజ్ ప్రదర్శించగా, ఆ విజువల్స్ హాల్లోని ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి.