fbpx
Wednesday, March 12, 2025
HomeSportsధోనీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రోమో వైరల్

ధోనీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రోమో వైరల్

dhoni-champions-trophy-promo-goes-viral

ముంబై: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీకి ముందు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో రూపొందించిన ప్రోమో వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ఈ ప్రోమోలో ధోనీ తనదైన శైలిలో అభిమానులను అలరించాడు.

ఈ ప్రోమోలో ధోనీ – “నేను కెప్టెన్‌గా ట్రోఫీ గెలిచాను, అప్పటి వరకు కూల్‌గా ఉన్నా. కానీ ఈసారి ఫ్యాన్‌గా మ్యాచ్‌లు చూస్తుంటే టెన్షన్ పెరుగుతోంది” అని అన్నాడు.

అంతేకాకుండా, ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధోనీ తనకు డీఆర్ఎస్ (ధోనీ రిఫ్రిజిరేషన్ సిస్టమ్) అవసరమని సరదాగా పేర్కొన్నాడు. వీడియోలో అతన్ని ఐస్ గడ్డలతో ముంచేయడం హైలైట్‌గా నిలిచింది.

2013లో ధోనీ నాయకత్వంలో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ టైటిల్‌ను మళ్లీ గెలుచుకోవడానికి రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు సిద్ధమవుతోంది. ధోనీ ప్రోమో విడుదలైన వెంటనే క్రికెట్ అభిమానులలో పెద్ద ఎత్తున ఆసక్తిని రేకెత్తించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular