fbpx
Wednesday, February 5, 2025
HomeTelanganaకుల గణన డ్రామా.. బీసీలకు అన్యాయం: కేటీఆర్

కుల గణన డ్రామా.. బీసీలకు అన్యాయం: కేటీఆర్

congress-bc-reservation-drama-ktr

తెలంగాణ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుల గణన, ఎస్సీ వర్గీకరణపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఎస్సీ వర్గీకరణ బాగానే ఉన్నా, కుల గణనపై మాత్రం కాంగ్రెస్ అసలు చిత్తశుద్ధి లేకుండా డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. 

బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించినప్పటికీ, దాన్ని అమలు చేసే తీరుపై స్పష్టత లేదని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇది ఎలా సాధ్యమవుతుందో ప్రజలకు వివరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

ఇతర వర్గాలకు అన్యాయం చేయకుండా బీసీలకు హక్కులు ఎలా కాపాడతారో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు మాయ మాటలు చెప్పి, చివరకు కేంద్రానికి బడులు పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

కేంద్రం నుంచి ఆమోదం రావాల్సిన అవసరం లేకుండా తెలంగాణ ప్రభుత్వమే చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన పాలసీని రూపొందించాలని సూచించారు. బీసీల భవిష్యత్తును రాజకీయ లబ్ధి కోసం తాకట్టుపెట్టడం తగదని కేటీఆర్ దుయ్యబట్టారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తున్నదనే ఆరోపణలు బలపడుతున్నాయి. నిజంగా బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పం ఉంటే, దీనిపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular