fbpx
Tuesday, February 11, 2025
HomeTelanganaతెలంగాణలో టీడీపీ బలపడేనా.. లోకేష్ ప్లాన్ ఏంటీ?

తెలంగాణలో టీడీపీ బలపడేనా.. లోకేష్ ప్లాన్ ఏంటీ?

tdp-expansion-telangana-nara-lokesh-strategy

హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి పునరుత్తేజం తీసుకురావాలని నారా లోకేష్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఏపీ ఎన్నికల విజయానంతరం చంద్రబాబు కొంతకాలం తెలంగాణపై దృష్టి పెట్టినా, పాలనలో బిజీ అవడంతో ఇప్పుడు లోకేష్ పూర్తి బాధ్యత తీసుకున్నట్టు కనిపిస్తోంది.

ప్రస్తుతం బీఆర్ఎస్ బలంగా ప్రతిపక్షంగా కొనసాగుతున్నప్పటికీ, కేసీఆర్ మౌనం వల్ల రాజకీయ వాతావరణం మారుతోంది. ఈ నేపథ్యంలో, టీడీపీకి తిరిగి ఊపొచ్చేలా వ్యూహం రచిస్తున్నారని సమాచారం. ఇప్పటికే కీలక నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

ఇంకా, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో లోకేష్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మద్దతుతో తెలంగాణలో పార్టీని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

అయితే, ఓటమి తర్వాత పార్టీకి మళ్లీ బలాన్ని తీసుకురావడం సులభం కాదు. ముఖ్యంగా, తెలంగాణ-ఏపీ మధ్య వివాదాలపై క్లారిటీ ఇవ్వడం, కొత్త నాయకత్వాన్ని నిర్మించడం వంటి ప్రధాన సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో లోకేష్ వ్యూహం ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి. త్వరలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular