fbpx
Tuesday, February 11, 2025
HomeNationalబీజేపీ న్యూ టార్గెట్.. భారీ వ్యూహంతో నెక్స్ట్ ఫైట్

బీజేపీ న్యూ టార్గెట్.. భారీ వ్యూహంతో నెక్స్ట్ ఫైట్

modi-target-mamata-government-bjp-focus

పశ్చిమ బెంగాల్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాలనలో బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. తాజాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో మమత ప్రభుత్వానికి పోటీగా నిలవాలి అని ప్రయత్నించినా, పూర్తి విజయం సాధించలేకపోయింది. అయితే వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ కసరత్తు చేస్తోంది.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గత కొన్ని సంవత్సరాలుగా బలంగా ఎదుగుతోంది. మోడీ ప్రభుత్వ నేషనల్ ప్రాజెక్టులు, సరిహద్దుల్లో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం ఈ వ్యూహానికి బలాన్నిస్తున్నాయి.

గత ఎన్నికల్లో మమత నియోజకవర్గంలో ఓటమి చవి చూడాల్సి వచ్చినా, ఈసారి మరింత గెలుపు అవకాశాలను పరిశీలిస్తున్నారు.

ఇప్పటికే మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటూ, రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి ప్రాజెక్టులపై ఎక్కువగా దృష్టి పెట్టి, పశ్చిమ బెంగాల్ ప్రజలకు బీజేపీ తన పాలన సౌలభ్యం చూపించేందుకు ప్రయత్నిస్తోంది.

మమతా బెనర్జీ మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా కొనసాగారు. కానీ నాలుగోసారి విజయం సాధించడం కష్టమవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ దీదీ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం ముమ్మరం చేస్తోంది.

ఈ నేపథ్యంలో, మోడీ-షా ద్వయం పశ్చిమ బెంగాల్‌ను టార్గెట్ చేస్తూ పూర్తి వ్యూహంతో ముందుకు వెళ్తోంది. మమతను ఓడించడం బీజేపీకి కీలకంగా మారింది. వచ్చే ఎన్నికలు మోడీ వ్యూహానికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular