హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ ప్రపంచంలోనే మొదటిసారిగా ఫిక్షనల్ రియాలిటీ(FR) అనే జోనర్ లో సినిమా అంటూ ”ఆర్జీవీ మిస్సింగ్” ని ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా ‘ఆర్జీవీ మిస్సింగ్’ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ విషయాన్నీ ఆర్జీవీ ట్వీట్ చేస్తూ ఇది తాను తప్పిపోయిన ఘటనకు సంబంధించిన సినిమా అని, దీనికి పవర్ ఫుల్ స్టార్ ఫ్యాన్స్ , మెగా ఫ్యామిలీ , మాజీ ముఖ్యమంత్రి మరియు పప్పు అని పిలవబడే ఆయన కుమారుడు అనుమానితులని తెలిపాడు. ఫస్ట్ లుక్ లో వర్మ బేడీలతో అమాయకపు ఫేస్ తో కనిపిస్తున్నాడు.
దీనికి అమాయకమైన బాధితుడు అని పేర్కొనడం ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా టీవీ బ్రేకింగ్ న్యూస్ లో ‘ఆర్జీవీ కిడ్నాప్ అయ్యాడు, పీకే ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ ముఖ్యమంత్రి మరియు ఆయన కుమారుడు అనుమానితులని’ వస్తున్నట్టుగా పోస్టర్ లో చూపించారు. వర్మ క్రియేట్ చేసిన ఈ చిత్రానికి అదిర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. కేవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చటర్జీ నిర్మిస్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రంలోని పీకే లుక్ పోస్టర్ ను విడుదల చేస్తానని వర్మ తెలిపారు.
ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీసులు నిజాలు బయటపెడతారు” అని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ చిత్రంలో ప్రవన్ కళ్యాణ్, ఒమేగా స్టార్, సీబెఎన్ (CBEN), లాకేష్ , WHY S జగన్, KCAR, KTAR తో పాటు పోలీసులు గ్యాంగ్ స్టర్స్ ఫ్యాక్షనిస్టులు కూడా నటించనున్నారని చెప్పుకొచ్చాడు. రిసల్ట్ తో సంబంధం లేకుండా తనకు తోచిన సినిమాలు ఒక దాని తర్వాత ఒకటి చేస్తుకుంటూ పోతున్నాడు వర్మ. ఈ మధ్య ఎక్కువగా నిజ జీవిత కథలు లేదా నిజ జీవిత సంఘటనలే తీస్తున్న వర్మ ప్రస్తుతం ఈ సినిమాతో రియల్ స్టోరీ కి ఫిక్షన్ జోడించి తియ్యబోతున్నారంట.