అమరావతి: అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 వరకు నిత్యం నడిచే పండుగ ప్రత్యేక రైళ్ల వివరాలు:
లింగంపల్లి–కాకినాడ పోర్ట్ స్పెషల్ ఎక్స్ప్రెస్: లింగంపల్లి స్టేషన్లో రాత్రి 8.30కి బయలుదేరి మరుసటి ఉదయం 7.20కి కాకినాడ చేరుకుంటుంది. నగరం వైపు వచ్చే రైలు కాకినాడలో రాత్రి 7.10కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.05కు లింగంపల్లి చేరుకుంటుంది.
లింగంపల్లి–తిరుపతి: లింగంపల్లిలో సాయంత్రం 5.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. నగరానికి వచ్చే రైలు తిరుపతిలో సాయంత్రం 6.25కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.55కు లింగంపల్లి చేరుకుంటుంది.
అక్టోబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు ప్రతిరోజూ నడిచేవి:
తిరుపతి–అమరావతి (మహారాష్ట్ర): తిరుపతిలో మధ్యాహ్నం 3.10కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.50కి అమరావతి చేరుకుంటుంది. అమరావతిలో ఉదయం 6.45కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.40కి తిరుపతి చేరుకుంటుంది.
అక్టోబర్ 23 నుంచి నవంబర్ 30 వరకు ప్రతిరోజూ:
లింగంపల్లి–నర్సాపూర్: లింగంపల్లిలో రాత్రి 9.05కు బయలుదేరి మరుసటి రోజు 7.45కు నర్సాపూర్ చేరుకుంటుంది. నగరానికి వచ్చే రైలు నర్సాపూర్లో సాయంత్రం 6.55కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50కి లింగంపల్లికి చేరుకుంటుంది.