fbpx
Saturday, September 21, 2024
HomeNationalఢిల్లీ లో 6842 కొత్త కోవిడ్ కేసులు నమోదు

ఢిల్లీ లో 6842 కొత్త కోవిడ్ కేసులు నమోదు

COVID-THIRD-WAVE-IN-NEWDELHI

న్యూ ఢిల్లీ: ఢిల్లీలో 24 గంటల వ్యవధిలో 6 వేలకు పైగా కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, ఇది వరుసగా రెండోసారి ఇలా నమోదయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో దేశంలో మహమ్మారి దెబ్బతిన్నప్పటి నుండి కోవిడ్-19 వ్యాప్తిని ఎదుర్కొంటున్న దేశ రాజధాని, ఒక రోజులో 6,842 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది ఇప్పటివరకు అత్యధికంగా నమోదైన కేసులు.

మంగళవారం, ఢిల్లీలో 6,725 కేసులను నివేదించడం ఇది మునుపటికి ఒక రోజులో అత్యంత ఎక్కువ కేసుల రికార్డు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం, నిపుణులు చాలా రోజులుగా ఎత్తిచూపిన మూడవ తరంగ అంటువ్యాధులు దేశ రాజధానిని తాకింది అనే విషయాలను అంగీకరించారు.

“కొంతకాలంగా, ఢిల్లీలో కరోనావైరస్ కేసుల సంఖ్య పెరిగింది. దీనిని మూడవ వేవ్ అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రేపు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నాము” అని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ రోజు తెలిపారు. కరోనా వ్యాప్తి కి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు, ప్రజలు కూడా ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని అభ్యర్థించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular