fbpx
Friday, April 11, 2025
HomeNationalశ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు రేపటి నుండి అనుమతి

శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు రేపటి నుండి అనుమతి

TIRUMALA-STEPS-WAY-REOPENS-THURSDAY

తిరుపతి: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్త జనం ఎన్నో గంటలు ఎదురు చూసి ఒక్క క్షణం స్వామిని చూసి తరించి పోతారు. అలాంటి ఆ స్వామి దర్శనాన్ని కరోనా వల్ల దాదాపు 6 నుండి 7 నెలలు భక్తులు కోల్పోయారు.

ఇన్నాళ్ళు వేచిన కోట్లాది భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త తెలిపింది. రేపటి (ఈ గురువారం) నుంచి శ్రీ వారి మెట్ల మార్గంలో భక్తులను అనుమతించ బోతున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అయితే, ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే దర్శనం టోకెన్లు ఉన్న వారిని అనుమతించ నున్నారు.

ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్, అటవీ సిబ్బంది నడకదారిలో ప్రత్యేకంగా గస్తీ నిర్వహించ నున్నారు. కరోనా నేపథ్యంలో తిరుమలకు దారితీసే రెండు ఘాట్ రోడ్లు, మెట్ల మార్గాన్ని అప్పట్లో మూసివేశారు. ఆ తర్వాత మెట్ల మార్గం తెరుచుకోవడం ఇదే తొలిసారి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

Trump Targets OPT