fbpx
Sunday, October 27, 2024
HomeAndhra Pradeshఅగ్రిగోల్డ్ భాధితులకు పరిహారం చెల్లించడానికి అనుమతి

అగ్రిగోల్డ్ భాధితులకు పరిహారం చెల్లించడానికి అనుమతి

TELANGANA-COURT-PERMITS-AGRIGOLD-REPAYMET-TO-DEPOSITORS

అమరావతి: రాష్ట్రంలో అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట మేరకు ఇప్పటికే రూ.10 వేల లోపు డిపాజిట్లు రూ.263.99 కోట్ల మేర చెల్లించిన సంగతి తెలిసిందే. కాగా రూ.20 వేల లోపు డిపాజిట్లు చెల్లించేందుకు తెలంగాణ హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది.

దీంతో మరోమారు డిపాజిట్ల చెల్లింపునకు ప్రభుత్వానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. వార్డు సచివాలయాల ద్వారా డిపాజిట్‌దారుల వివరాలను సీఐడీ సేకరిస్తుందని తెలంగాణ హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

వారు సేకరించిన డిపాజిట్‌దారుల వివరాలను సీఐడీ డీఎస్పీ, ఆర్డీవో పరిశీలిస్తారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దరఖాస్తులను ధృవీకరిస్తారు. కలెక్టరేట్‌ ద్వారా అర్హులైన డిపాజిటర్లకు బ్యాంకు ఖాతాలో డబ్బును జమ చేస్తామని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్‌ కోర్టుకు తెలిపారు.

మార్చి 31 నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. అయితే, అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలంపై తమ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆంధ్ర బ్యాంకు, ఎస్‌బీఐలు తెలంగాణ హైకోర్టు దృష్టికి తెచ్చాయి. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్‌ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ వేసింది. దీనిపై హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ (సీజే) నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular