fbpx
Sunday, October 27, 2024
HomeInternationalట్రంప్ కు సుప్రీం కోర్టులో కూడా పరాజయం

ట్రంప్ కు సుప్రీం కోర్టులో కూడా పరాజయం

SUPREMECOURT-GIVES-SHOCKS-TO-TRUMP-MAIL-VOTES

న్యూఢిల్లీ : జో బైడెన్ అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రం నుంచి తన‌ ఎన్నిక చెల్లదంటూ రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధి అయిన మైక్‌ కెల్లీ దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికా లోని సుప్రీం కోర్టు అసలు విచారించకుండానే కొట్టేసింది. జో బైడెన్‌కు మెయిల్‌ ద్వారా ఎక్కువ ఓట్లు వచ్చాయని, మెయిల్‌ ఓట్లకు రాజ్యాంగపరంగా భద్రత లేనందున పెన్సిల్వేనియా నుంచి ఆయన‌ ఎన్నిక చెల్లదని పిటిషనర్‌ పేర్కొన్నారు.

ఇలాంటి పనికిరాని పిటిషన్లను ఇదివరకే కోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాల్సిన అవసరం అసలు లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా 2016లో జరిగిన యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థి అయిన డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా మెయిల్‌ ఓట్ల ద్వారానే విజయం సాధించారు.

మరి అప్పుడు చెల్లిన ఓట్లు జో బైడెన్‌ విషయంలో ఎలా చెల్లకుండా పోతాయని న్యాయవర్గాలు వ్యాఖ్యానించాయి. డొనాల్డ్ ట్రంప్‌ ప్రతినిధులు అవసరం లేకున్నా కూడా కోర్టులను ఆశ్రయించి అవమానాల పాలవుతున్నారని పేర్కొన్నాయి. ఇక పెన్సిల్వేనియా నుంచి బైడెన్‌ 80 వేల మెజారిటీతో ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లను గెలుచుకున్నారు.

జోబైడెన్‌ విజయాన్ని ఖరారు చేసే ముందుగా ఆ రాష్ట్ర ఎలక్టోరల్‌ కాలేజ్‌కి చెందిన 20 మంది ఎలక్టర్లు డిసెంబర్‌ 14వ తేదీన సమావేశమవుతున్నారు. కాగా అమెరికా సుప్రీం కోర్టు 9 మంది న్యాయమూర్తులు ఉండగా, వారిలో ఆరుగురు ట్రంప్‌ నియమించిన వారే. ఆ ఆరుగురు తనవైపు తీర్పు చెబుతారనే ఉద్దేశంతో ట్రంప్, అన్ని రాష్ట్రాల ఎన్నికలపైన సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఆ ఆరుగురిలో ముగ్గురు జడ్జీలు వ్యతిరేకిస్తూ రావడంతో ట్రంప్‌ పిటిషన్లన్నీ వీగిపోతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular