fbpx
Sunday, October 27, 2024
HomeNationalచెన్నై ఐఐటీలో కరోనా వైరస్ కలకలం

చెన్నై ఐఐటీలో కరోనా వైరస్ కలకలం

CORONA-CASES-IN-IIT-CHENNAI

చెన్నై: చెన్నై ఐఐటీలో కరోనా కలకలం చెలరేగింది. దాదాపు 100 మందికి పైగా విద్యార్థులకు కరోనా సోకడంతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాసుని తాత్కాలికంగా మూసివేశారు. మొత్తం 104 మంది విద్యార్థులకు కోవిడ్‌ సోకగా, అందరి పరిస్థితీ నిలకడగానే ఉన్నట్టు తమిళనాడు హెల్త్‌ సెక్రటరీ జె.రాధాకృష్ణన్‌ తెలిపారు.

మొత్తంగా 444 శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో 104 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ గా తేలింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ఆదేశాల మేరకు వీరందరికీ, కింగ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చ్‌లో చికిత్సనందిస్తున్నట్టు ఆయన తెలిపారు. వివిధ శాఖలను, ప్రయోగశాలలను మూసివేసినట్లు ఐఐటీ అధికార ప్రతినిధి తెలిపారు.

ప్రస్తుతం కేవలం 700 మంది విద్యార్థులు, ప్రధానంగా రీసెర్చ్‌ స్కాలర్స్‌ మాత్రమే తొమ్మిది హాస్టల్స్‌లో ఉన్నారని, ఆన్‌లైన్‌ క్లాసులనే నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. విద్యార్థులను వారి వారి గదులకే పరిమితం కావాలని, క్వారంటైన్‌లో ఉండాలని ఆయన సూచించారు. విద్యార్థుల గదులకే ప్యాకెట్లలో ఆహారాన్ని అందజేస్తున్నారు.

తమిళనాడులో అన్ని కాలేజీల్లో పీజీ రెండో సంవత్సరం, పీహెచ్‌డీ విద్యార్థులకు ఈనెల 2వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించారు. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 7 నుంచి తరగతులు ఆరంభం అయ్యాయి. ఐఐటీలోని 66 మంది పీహెచ్‌డీ విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. మరో ఐదుగురు సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది.

సోమవారం నాటికి కరోన పాజిటివ్ ఉన్న సంఖ్య 104కి చేరింది. హాస్టల్‌ విద్యార్థులకు కరోనా సోకడంతో ఐఐటీ ప్రాంగణంలోని అన్ని విభాగాలు, లైబ్రరీలు, క్యాంటీన్లను మూసివేస్తున్నట్లు రిజిస్ట్రార్‌ సోమవారం ఒక సర్క్యులర్‌ జారీచేశారు. అధ్యాపకులు, సిబ్బంది, ప్రాజెక్టు డైరెక్టర్లు, పీహెచ్‌డీ విద్యార్థులు వర్క్‌ ఫ్రం హోం పాటించాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular