fbpx
Sunday, October 27, 2024
HomeSportsఐపీఎల్ పై బీసీసీఐ కీలక నిర్ణయం

ఐపీఎల్ పై బీసీసీఐ కీలక నిర్ణయం

IPL-2022-10-TEAMS-INTRODUCING-BY-BCCI

అహ్మదాబాద్‌: బీసీసీఐ ఐపీఎల్‌–2022 ఎడిషన్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఐపీఎల్ లో ఉన్న 8 జట్లతో పాటు మరో రెండు కొత్త టీమ్‌లను అదనంగా చేర్చబోతోంది. దీంతో మొత్తంగా 10 జట్లు ఈ మెగాటోర్నీలో టైటిల్‌ కోసం తలపడపోతున్నాయి. ఈ మేరకు గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

అయితే కరోనా కాలంలోనూ బీసీసీఐ, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 13వ సీజన్‌ను దుబాయ్ లో విజయవంతంగా పూర్తిచేసిన సంగతి తెలిసిందే. కాస్త ఆలస్యంగా ప్రారంభమైనా క్రికెట్‌ ప్రేమికులకు కావాల్సినంత మజా అందించింది. యూఏఈ వేదికగా జరిగిన ఈ మెగాటోర్నీలో ముంబై ఇండియన్స్‌ మరోసారి ట్రోఫీని తమ కైవసం చేసుకుంది.

గత నెలలో ఐపీఎల్‌-2020కి శుభం కార్డు పడినప్పటి నుండే రాబోయే 2021 సీజన్‌లో 10 జట్లను ఆడిస్తారంటూ ప్రచారం చాలా జోరుగానే జరిగింది. కానీ వచ్చే ఏడాది ఐపీఎల్‌కు చాలా తక్కువ సమయం ఉండటంతో టెండరింగ్‌ ప్రక్రియ, మెగా వేలం నిర్వహించడం కష్టతరమని బీసీసీఐ పెద్దలు భావించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఐపీఎల్‌ చరిత్రలో 2011, 2012, 2013 మినహా ఇంతవరకు ఏ సీజన్‌లోనూ 9 కంటే ఎక్కువ జట్లు బరిలోకి దిగలేదు. ఇక 2022లో 10 జట్లు, 94 మ్యాచ్‌లతో బిగ్‌ టోర్నమెంట్‌ చూడవచ్చని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. ఒలింపిక్స్‌(2028)లో క్రికెట్‌ను చేర్చాలన్న అంశంపై ఈ సమావేశంలో విస్త్రృత చర్చ కూడా నడుస్తున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular