fbpx
Sunday, October 27, 2024
HomeAndhra Pradeshఏపీలో నేడు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతం

ఏపీలో నేడు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతం

HOUSE-SITE-PATTAS-DISTRIBUTION-IN-AP

తూర్పు గోదావరి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, ఆ కారణం చేతనే ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ రోజు పట్టాల పంపిణీ కార్యక్రమం లో అన్నారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలోనే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం జగన్‌ తెలిపారు. దీనిలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిలో ఇళ్లు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, ఈ పథకం కింద మొదటి దశలో 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టనుండగా రెండు దశల్లో 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ఉచితంగా పూర్తి చేసిస్తామని చెప్పారు.

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి వరుసగా 15 రోజుల పాటు పెద్ద పండగలా పట్టాల పంపిణీ చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షల మందికిపైగా అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వైకుంఠ ఏకాదశి, క్రిస్‌మస్‌ పర్వదినాన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం​ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

అమరావతిలో 54వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామంటే సామాజిక అసమతుల్యం వస్తుందంటూ టీడీపీ కోర్టుకెళ్లింది. ప్రతిపక్షాలా పిటిషన్ల వల్ల 10% ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. నిన్న కూడా హైకోర్టులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై మరో కొత్త పిల్ దాఖలు చేశారన్నారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం సుప్రీం కోర్టులో పోరాడుతుందని త్వరలోనే అన్ని అడ్డంకులన్నీ తొలగిపోతాయన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular