fbpx
Friday, October 18, 2024
HomeBusinessకేంద్రం జీఎస్టీ పై కీలక నిర్ణయం తీసుకోనుందా?

కేంద్రం జీఎస్టీ పై కీలక నిర్ణయం తీసుకోనుందా?

GST-COUNCIL-SLAB-MERGE-IN-MARCH-UNDER-PLANNING

న్యూఢిల్లీ: భారత కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్నుల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోందని సమాచారం. తాజాగా వెలువడుతున్న నివేదికల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ విధానాన్ని మరింత సరళతరం చేయాలని భావిస్తోందన్నట్లు తెలుస్తోంది.

జీఎస్‌టీ రేట్లలో ప్రస్తుతం ఉన్న 12శాతం, 18శాతం గల ట్యాక్స్ స్లాబ్స్‌ను ఒకే స్లాబ్‌లో విలీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వచ్చే నెల మార్చిలో జరిగే జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై చర్చించే అవకాశాలు ఉన్నాయని ఆ అధికారి తెలిపారు.

దేశంలో నాలుగు జీఎస్‌టీ స్లాబు రేట్లు 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా అమలులో ఉన్నాయి. అలాగే ఆటోమొబైల్స్, పొగాకు, ఎరేటెడ్ డ్రింక్స్ వంటి లగ్జరీ & డీమెరిట్ వస్తువులపై ప్రత్యేక సెస్ కూడా ఉంది. పైన చెప్పిన జీఎస్‌టీ స్లాబులలో 12శాతం, 18శాతం రేట్లను కలిపి తక్కువ స్లాబ్ గా తీసుకొస్తే సామాన్యులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

అనుకున్న ప్రకారం నిజంగానే మార్చిలో జరిగే తదుపరి (జీఎస్‌టీ) కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటే దేశంలో మూడు ట్యాక్స్ స్లాబులు మాత్రమే ఉంటాయని చెప్పుకోవచ్చు. దీనిపై 15వ వేతన కమిషన్ కూడా ఇప్పటికే 12, 18 శాతం స్లాబులను కలిపేయాలని గతంలో సిఫార్సు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular