fbpx
Thursday, September 19, 2024
HomeAndhra Pradeshఅచ్యుతాపురం ఘటన మృతుల కుటుంబాలకు కోటి పరిహారం!

అచ్యుతాపురం ఘటన మృతుల కుటుంబాలకు కోటి పరిహారం!

ACHYUTAPURAM-VICTIMS-GET-1-CRORE-COMPENSATION
ACHYUTAPURAM-VICTIMS-GET-1-CRORE-COMPENSATION

అమరావతి: బుధవారం అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీ జరిగిన ప్రమాదం యొక్క బాధితులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

గురువారం విశాఖ చేరుకున్న ఆయన మొదట మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు.

బాధితులకు సీఎం ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. వారు త్వరగా కోలుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

ఆసుపత్రిలోని వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు అందిస్తున్న చికిత్స వివరాలను ఆయన ఆరా తీసారు. తరువాత బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

చంద్రబాబు నాయుడు ఎవరినీ భయపడ వద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.

ఆసుపత్రి వెలుపల మీడియాతో ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం తనను తీవ్రంగా బాధించిందని తెలిపారు.

ప్రమాద మృతుల ప్రతి కుటుంబానికి ఆయన రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

అలాగే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 లక్షలు మరియు స్వల్ప గాయాల పాలైన వారికి రూ. 25 లక్షల చొప్పున అందిస్తామని తెలిపారు.

అలాగే, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపడతామని కూడా ఆయన తెలిపారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 60 రోజులు మాత్రమే అయిందని ఈ ప్రమాదానికి ఎవరు కారణమని ఆయన మీడియాను ప్రశ్నించారు.

గత వైసీపీ ప్రభుత్వం తప్పులు చేసి వాటిని తమ ప్రభుత్వం పై వేయాలని చూస్తోందని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular