అన్నమయ్య జిల్లాలో యాసిడ్ దాడి కేసులో కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా (Annamayya District)లో యాసిడ్ దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. గుర్రంకొండ మండలం ప్యారంపల్లె గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థినిపై ఓ యువకుడు ప్రేమ విఫలమయ్యిందన్న కోపంతో కత్తితో దాడి చేసి, అనంతరం యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బాధితురాలికి న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
- ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
- నిందితుడిని త్వరగా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
- బాధితురాలికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు.
- ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మంత్రి నారా లోకేశ్ దిగ్బ్రాంతి
- రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
- బాధిత యువతికి వైద్యసాయం అందించేందుకు ప్రభుత్వ అన్ని చర్యలూ తీసుకొంటుందని తెలిపారు.
- నిందితుడిని కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు శాఖ మరింత కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నిందితుడిపై కఠిన చర్యలు
- దాడి చేసిన వ్యక్తిని గణేష్గా గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
- పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు.