చెన్నై: చివరి వారం జరిగిన ‘నీట్’ పరీక్షా జరిపిన విధానం పై, ఆ పరీక్షా కారణంగా ఆత్మబలి చేసుకున్న విద్యార్థులపై సంఘీభావం సూర్య తో చేసిన ప్రకటన మద్రాస్ హై కోర్ట్ లో చర్చనీయాంశం అయింది. సూర్య చేసిన వ్యాఖ్యలు సరికావని సూర్య పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని మద్రాస్ హై కోర్టు కి వినతులు అందాయి.న్యాయ వ్యవస్థను ప్రశ్నించడం అంటే ఏమాత్రం సమంజసం కాదంటూ నెటిజన్స్ కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
నీట్ పరీక్షల నిర్వాహణ విషయంలో సూర్య చేసిన వ్యాఖ్యలను న్యాయమూర్తులు తీవ్రంగా తీసుకోవడం లేదని పేర్కొన్నారు. సూర్య వ్యాఖ్యలను అనవసరమైనవిగా సమర్థనీయం కానివని కోర్టు పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో న్యాయ వ్యవస్థను పరిరక్షించేందుకు మేము పని చేస్తున్నాం. మేము చేసే పనిని ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడటం సరి కాదు అంటూనే సూర్య వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోబోవడం లేదంటూ మద్రాస్ హైకోర్టు పేర్కొంది. దాంతో సూర్యపై కోర్టు దిక్కారం కేసు లేనట్లే అంటూ తేలిపోయింది.
విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో ఆయన కాస్త వేదనతో ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతే తప్ప న్యాయ వ్యవస్థను అవమానపర్చేలా ఆయన మాట్లాడినట్లుగా తాము భావించడం లేదని కోర్టు పేర్కొంది. ఆ తర్వాత సూర్య కూడా మద్రాస్ హై కోర్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల తనకి చాలా గర్వంగా ఉందని, ప్రజల ప్రాథమిక హక్కుని గౌరవించినందుకు ఆనందంగా ఉందని ట్వీట్ ద్వారా తెలిపారు.