fbpx
Tuesday, October 22, 2024
HomeAndhra Pradeshయువతను స్ఫూర్తిగా నిలిచే నేత చంద్రబాబు: రామ్మోహన్ నాయుడు

యువతను స్ఫూర్తిగా నిలిచే నేత చంద్రబాబు: రామ్మోహన్ నాయుడు

amaravati-drone-summit-starts-grandly

చంద్రబాబు: మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమరావతి డ్రోన్ సమ్మిట్‌ను ఘనంగా ప్రారంభించింది. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి జాతీయ స్థాయిలో జరిగే ఈ సదస్సు 2 రోజులపాటు అమరావతి, మంగళగిరి, విజయవాడలో జరుగనుంది.

ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు మంత్రులు హాజరయ్యారు.

సదస్సులో ప్రసంగించిన రామ్మోహన్ నాయుడు, సరికొత్త సాంకేతికతలను ప్రోత్సహించడంలో చంద్రబాబు పాత్రను ప్రశంసించారు. ‘‘సీఎం చంద్రబాబు ఎప్పుడూ యువతతో పోటీపడుతూ, కొత్త ఆలోచనలు చేస్తుంటారు. 1996లో విజన్ 2020ని ముందే ఊహించి రాష్ట్ర అభివృద్ధి కోసం అడుగులు వేశారు’’ అని అన్నారు.

డ్రోన్ టెక్నాలజీ ప్రాముఖ్యతను బాగా అర్థం చేసుకున్న చంద్రబాబు, ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్రం కూడా డ్రోన్ల వినియోగానికి మద్దతు ఇవ్వడం సంతోషకరమని, సులభతరం చేసిన నిబంధనలతో స్టార్టప్‌లు ప్రోత్సాహం పొందుతున్నాయని పౌర విమానయాన శాఖ కార్యదర్శి పేర్కొన్నారు.

ప్రధాని మోడీ నాయకత్వంలో దేశ అభివృద్ధి కొనసాగుతుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాబోయే 20 ఏళ్లలో 200కి పైగా విమానాశ్రయాలు ఏర్పాటవుతాయని, డ్రోన్ సాంకేతికతలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంటుందని అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular