fbpx
Saturday, February 1, 2025
HomeAndhra Pradeshపరీక్షలపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం

పరీక్షలపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం

ANDHRA-PRADESH-SUBMITS-AFFIDAVIT-ON-SSC-INTER-EXAMS

ఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ మరియు ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో బుధవారం రోజున అఫిడవిట్‌ దాఖలు చేసింది. కరోనా వైరస్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది. కరోనా‌ వైరస్ నివారణ జాగ్రత్తలు పాటిస్తూ టెన్త్ మరియు ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

అయితే ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశానుసారంగా తగు నిర్ణయం తీసుకుంటామని కూడా అఫిడవిట్ లో స్పష్టం చేసింది. విడి విడి రోజుల్లో ఇంటర్‌ ఫస్టియర్‌ మరియు సెకండియర్‌ పరీక్షలు నిర్వహిస్తామని, ఒక్కో పరీక్ష గదిలో కేవలం 15 నుంచి 18 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది.

పరీక్ష గదిలో ఒక్కో విద్యార్థి మధ్యన 5 అడుగుల కనీస దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని, భౌతిక దూరం, శానిటేషన్‌ తదితర అంశాలను కచ్చితంగా అమలు చేయనున్నట్లు తమ అఫిడవిట్‌లో పేర్కొంది. విద్యార్థుల పరీక్ష కేంద్రం లోకి రావడానికి, బయటకు వెళ్ళడానికి వేర్వేరుగా ఉంటాయని అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రభుత్వం, విద్యార్థుల దీర్ఘ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నట్లు సుప్రీంకు స్పష్టం చేసింది.

కాగా తాము పరీక్షలు నిర్వహించడానికి కోర్టు అనుమతి ఇవ్వాలని అఫిడవిట్‌లో కోరింది. ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కాగా ఏపీలో టెన్త్‌, ఇంటర్మీడియెట్‌ పరీక్షల నిర్వహణపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular