ఏపీ: అసెంబ్లీలో భోజనం నాణ్యతపై అసంతృప్తి వ్యక్తమవ్వడంతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు దీని పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా సుమారు 500 మందికి భోజనం అందించాల్సి ఉండగా, ఆహారం నాణ్యతపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ ఫిర్యాదులు స్పీకర్ దృష్టికి చేరడంతో ఆయన కాంట్రాక్టర్ను ప్రశ్నించారు. “అసెంబ్లీకి వేరే, సభ్యులకు వేరే భోజనం పెట్టారా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో భోజనం నాణ్యతపై జరిగిన ఈ ఘటనతో కొద్దిమందికి మాత్రమే సేవలందిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ అంటే తమాషా అనుకుంటున్నారా అంటూ అధికారులను ప్రశ్నించిన స్పీకర్, భోజనం సరఫరా చేసే పాత కాంట్రాక్టర్ను వెంటనే మార్చాలని ఆదేశించారు.
ఈ ఆదేశం మేరకు రాత్రికి రాత్రే కాంట్రాక్టర్ మార్పు జరిగి, మంగళవారం నుంచి కొత్త కాంట్రాక్టర్ బాధ్యతలు స్వీకరించాడు. ఈ నిర్ణయం ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ప్రశంసలు పొందింది.
స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీసుకున్న ఈ చర్యను అందరూ అభినందిస్తూ, సభ్యుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో మంచి పని చేశారని కొనియాడారు.