అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులతో సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు భేటీ అవనున్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ఏయే అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించాలో సీఎం ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులను రాబట్టేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ భావిస్తోంది.
ఇంకో వైపు ప్రత్యేక హోదా సాధనకు కూడా అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీనిపైనా ఎంపీల సమావేశంలో చర్చించే వీలుందని పార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.