fbpx
Monday, September 16, 2024
HomeAndhra Pradeshశాస్త్రవేత్తలను అభినందించిన ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌

శాస్త్రవేత్తలను అభినందించిన ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌

AP-GOVERNOR-APPRECIATES-SCIENTISTS-FOR-DEVELOPING-VACCINE

అమరావతి: ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించి దాదాపు సంవత్సరం పైగా అందరినీ ఇంటికే పరిమితం చేసింది కరోనా మహమ్మారి. అలాంటి కరోనాపై పోరులో భాగంగా రెండు దేశీయ టీకాలను విజయవంతంగా అభివృద్ది చేసి దేశవ్యాప్త పంపిణీకి మార్గం సుగమం చేసిన భారత శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు.

నిన్న అనగా శనివారం దేశవ్యాప్తంగానూ, మరియు ఆంధ్రప్రదేశ్ లోనూ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించటం చాలా శుభపరిణామమన్నారు. పరిశోధకులు తమ నిరంతర ప్రయత్నాల ఫలితంగా అతి తక్కువ వ్యవధిలో టీకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని ఆయన ఈ సందర్భంగా గవర్నర్ ప్రశంసించారు.

ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఆరోగ్య కార్మికుల ప్రయోజనాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ కరోనా టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నేపధ్యంలో రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు, వైద్య బృందాలను గవర్నర్ అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular