fbpx
Monday, October 28, 2024
HomeAndhra Pradeshఏపీలో 15 ఆగష్టు నుండి విద్యాసంస్థల ప్రారంభం!

ఏపీలో 15 ఆగష్టు నుండి విద్యాసంస్థల ప్రారంభం!

AP-SCHOOLS-START-AUGUST15TH

తాడేపల్లి: కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో మూత పడ్డ రాష్ట్ర విద్యాసంస్థలు అన్నీ కుదిరితే ఆగష్టు 15 వ తేదీ నుండి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు ఏపీ ముఖ్యమంత్రి ఇవాళ ప్రకటించారు.

ఏపీలో విద్యాసంస్థల్లో వచ్చే నెల ఆగష్టు కల్లా పెండింగ్ ఉన్న నాడు-నేడు పనులు పూర్తి కావాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అలాగే జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్ ‌బుక్స్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని తెలిపారు.

రూ.16 వేల కోట్లతో నాడు-నేడు కింద పనుల కోసం బడ్జెట్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నాడు నేడు, జగనన్న విద్యా కానుకపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

ఏపీలో జాతీయ నూతన విద్యా విధానాన్ని అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, విద్యావంతులైన నైపుణ్యం గల టీచర్లతో బోధన అందించాలని తెలపారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లు ఉండాలన్నారు.

ఆగష్టు 15 తర్వాత పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆగష్టు 15 లోపు టీచర్లకు వ్యాక్సినేషన్‌ వేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆయన అధికారులకు సూచించారు. ఆగష్టులోనే విద్యా కానుక, నాడు-నేడు రెండో విడత పనులు ప్రారంభం కావాలన్నారు. తొలివిడత పనులు పూర్తైన పాఠశాలలను ప్రజలకు అంకితం చేయనున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular