fbpx
Thursday, September 19, 2024
HomeAndhra Pradeshమంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - ముగ్గురికి గాయాలు

మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం – ముగ్గురికి గాయాలు

AP-State minister-Gummadi Sandhyarani’s-escort- vehicle- met-accident

విజయనగరం: విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం భూసాయివలస వద్ద రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. మెంటాడ పర్యటనకు వెళ్తున్న సమయంలో మంత్రి ఎస్కార్ట్ వాహనాన్ని ఓ వ్యాన్ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు భద్రతా సిబ్బందితో పాటు వ్యాన్లో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. మంత్రి సంధ్యారాణి స్పందిస్తూ క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్టు తెలిపారు.

మద్యం మత్తులో ప్రమాదం!

ప్రమాదానికి సంబంధించిన వివరాలను వెల్లడించిన మంత్రి సంధ్యారాణి, వ్యాన్‌ డ్రైవర్ ఉదయం 7 గంటలకే మద్యం సేవించి మత్తులో ఉండి వాహనాన్ని అజాగ్రత్తగా నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

డ్రైవర్ వయస్సు 25 ఏళ్ల లోపే ఉండగా, అతని నిర్లక్ష్యం కారణంగా తమ భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎస్కార్ట్ వాహన డ్రైవర్‌ సమయస్ఫూర్తితో ప్రాణాపాయాన్ని తప్పించాడని, అందరి ప్రాణాలను కాపాడాడని మంత్రి ప్రశంసించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular