fbpx
Saturday, February 22, 2025
HomeAndhra Pradeshవలంటీర్ వ్యవస్థపై ఏపీలో కొనసాగుతున్న గందరగోళం

వలంటీర్ వ్యవస్థపై ఏపీలో కొనసాగుతున్న గందరగోళం

ap-volunteer-system-confusion-continues

ఆంధ్రప్రదేశ్‌: వలంటీర్ వ్యవస్థ గురించి గడచిన ఆరు నెలలుగా చర్చలు వేడెక్కుతున్నాయి. చంద్రబాబు ఎన్నికల హామీ ప్రకారం ఈ వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాలను రూ.10 వేల వరకు పెంచుతామని చెప్పారు. కానీ, ప్రస్తుతం ఈ వ్యవస్థ కొనసాగుతుందా లేదా అన్నదానిపై అధికారికంగా స్పష్టత లేదు.

తాజాగా శాసన మండలిలో ఈ అంశం చర్చకు వచ్చింది. వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వివరణ ఇచ్చారు. వలంటీర్ వ్యవస్థ ప్రస్తుతం మనుగడలో లేదని, దీనికి కారణం జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమేనని తెలిపారు.

2023 ఆగస్టు నెలలో జగన్ ప్రభుత్వం ఈ వ్యవస్థను కొనసాగించేందుకు జీవో ఇవ్వాల్సి ఉండగా, ఆ పని చేయలేదని అన్నారు.

ఈ వ్యవస్థ కొనసాగుతుందా లేదా అన్న దానిపై స్పష్టత లేకపోవడం వల్ల వేతనాల చెల్లింపు విషయంలో కూడా అనిశ్చితి నెలకొంది. అయితే, మే 2023 వరకు వలంటీర్లకు వేతనాలు చెల్లించినట్టు మంత్రి వివరించారు. వైసీపీ సభ్యులు, “వలంటీర్ వ్యవస్థ లేకపోతే మే వరకూ వేతనాలు ఎలా చెల్లించార?” అంటూ ప్రశ్నించారు.

వలంటీర్ వ్యవస్థపై ఆలోచనలు ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయాధారంగా ఉంటాయని, కొత్త వలంటీర్ల నియామకంపై ఇంకా స్పష్టత లేదని మంత్రి తెలిపారు. వలంటీర్ వ్యవస్థతో భవిష్యత్‌లో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular