అమరావతి: త్వరలో ఏపీ లో ఏపీపీఎస్సీ ద్వారా సుమారు 1,200కు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. దీనికి సంబంధించి పోస్టుల సంఖ్యపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా తొందరలోనే దీనికి సంబంధించిన సమగ్ర ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రభుత్వం గ్రూప్–1, గ్రూప్–2 సహా 1,200కు పైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం ఆగస్టులో ఈ నోటిఫికేషన్లు జారీచేస్తామని ఏపీపీఎస్సీ సభ్యుడు ఎస్.సలాంబాబు మీడియాతో చెప్పారు.
కాగా రాష్ట్రంలో ఇటీవల విడుదలైన జాబ్ క్యాలెండర్పై కొందరిలో కొన్ని సందేహాలు తలెత్తాయి. ప్రస్తుతం ఏపీపీఎస్సీ వద్ద ఇప్పటికే దాదాపు 1,180 వరకు ఖాళీ పోస్టుల వివరాలు అందుబాటులోకి వచ్చాయి అని సమాచారం.
అయితే అందిన సమాచారం గ్రూప్–1, గ్రూప్–2 కేటగిరీల్లో మరిన్ని పోస్టులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అని ఆయన తెలిపారు. కాగా 2018లో ఏపీపీఎస్సీ జారీచేసిన నోటిఫికేషన్లకు సంబంధించి సరైన అర్హులైన అభ్యర్థులు లేక సుమారుగా 364 పోస్టులు భర్తీ కాకుండా మిగిలి పోయాయి. కాబట్టి వాటితో పాటు ఇతర ఖాళీల భర్తీకి వీలుగా చర్యలు కూడా తీసుకుంటున్నామని అన్నారు.